ఆయనపేరు వీరారెడ్డి.స్వతహాగా ఏమీ చదువుకోలేదు.తన సంతానాన్నయినా చదివించి తృప్తిపడదామనుకుంటే నిస్సంతు.అలాగని మొహం ముడుచుకు కూర్చోలేదు.
ఉన్నతపాఠశాలలో ఒక గది కట్టాలంటే పాతికవేలవుతుంది.[1950-55] లనాటి పరిస్థితి.ఆడబ్బు తనే సమకూరుస్తానన్నాడు.ఆ గదికి ఆయన పేరు పెడతామంటే పేరుకోసంకాదు యేటా పదిమంది పిల్లలకు ఆగది ఆశ్రమయితే అదేచాలునన్నాడు.కానీ ప్రభుత్వం ఆయన పేరు పెట్టి తమవంతు కృతజ్ఞతతెలియజేసారు.ఓ బీద కుర్రాడిని మెడిసిన్ లో గుంటూరు వైద్య కళాశాలలో చేర్పించి అతని చదువూ నిరాటంకంగా సాయ పడ్డాదు. ఆకుర్రాడుగూడా 'మా నాన్న'నే పిలుచుకునే వాడు ఊళ్ళొనే పిల్లనిప్పించి సాయపడ్డా డు .ఎ చే బొ ము [ఎడమచేతి బొటనవేలి ముద్ర]అయినా ఎందరికో విద్యాగంధం పూసి తన జీవితాన్ని సార్ధకం చేసుకున్నాడు.
డబ్బులిస్తామని కాలేజీకి పేరు పెట్టించుకుని దబ్బులివ్వని మహా వదాన్యులు వున్న మన రాష్ట్రంలో ఇది అమూల్యమైన అత్యంత ఆదర్శప్రాయమైన కార్యమే కాదనగలమా. ఆవిద్యార్ధి కంటి వైద్య నిపుణునిగా పేరు బడసినారని చెప్పడానికి సంతోషపడుతున్నాను.ఇదీ మావూరు లోనిఓ వదాన్యుడికధ
============================================
No comments:
Post a Comment