మంచి ఉపాధ్యాయుడంటే బీయేలూ ఎమ్మెలు చదవడమో, బీ ఈడినో ఎం ఈడీ డిగ్రీలు పేరు వెనుక తగిలించుకోవడమో కానే కాదని రుజువు చేసిన వాళ్ళు,నాలుగయిదు డశాబ్దాలక్రితం అసంఖ్యాకంగా దొరుకుతారనీ, వాళ్ళు వేసుకునే బట్టల ద్వారాకూడా ఆ గౌరవం
అధికస్య అధికం ఫలమన్న రీతిలో ఉండదనీ,జాతీయ స్థాయిలోనో
రాష్ట్ర స్థాయిలోనో ఉత్తమ ఉపాధ్యాయుడిగా పెరూ
బిరుదులోపురస్కారాలవేటో వారిని ప్రభావితం చెయ్యలేవని నేను గాఢంగా నమ్మ వలసిన అవసరం మావూళ్ళో కోమటి వీరయ్యగారిని చూసిన ఎవరికయినా ఇట్టే అర్ధమయిపోతుందని నా గట్టి నమ్మకం.వాళ్ళు ప్రభుత్వమిచ్చే దివ్యమైన జీతాలప్రభావం కానే కాదని ఇట్టే అందరికీ అవగరమౌతుంది,
ముతక ఖద్దరు బట్టలలో[ఇరవై నంబరనే వాళ్ళని గుర్తు.]
అప్పటికే కొంత తెల్లబడినమీసాలతో బాగా చిలికిన వెన్నా మీగడలందించిన దేహ పుష్టితో అలరారే మూర్తి విగ్రహం ఆయనది. ఉదయం ప్రారంభంలో సరస్వతీ నమస్తుభ్యంతో --- మొదలెట్టి మసక మసక చీకటి పడకముందే దీపంజ్యోతి పరబ్రహ్మం శ్లోకాన్ని
వల్లించమంటూ మాతో గొంతు కలిపే దాకా ఆయన చదువు చెప్పడంకొన సాగేది.మాకు ఇప్పటిలా బండెడుపుస్తకాలను మోసే అవసరమూ ఉండేదిగాదు.ఓమట్టి పలక[మార్కాపురం పలకలనే వారు] ఆరర్వాత కొంత కాలానికి రేకు పలకలు లొతలొటలాడుతూ వచ్చాయి. ఆపెద్ద పలకలోనే అన్ని సబ్జెక్ట్ల సారం రంగరించ బడి ఉండేవి.అప్పట్లో ఆయన ఎక్కాలు చెప్పడం అప్పగించుకుమే తీరు చాలా భిన్నంగా
వుండేది.పిల్లలమే ఒకరికొకరం ఎదురెదురుగా నిలబడి
అప్పజెప్పుకుంటూఉంటే దీక్షతో ఆయన బహు ఏకాగ్రతతో గమనించే వారు.తప్పు చెప్పామా చింత [సగం పచ్చిది] బరికెతో సన్మానం
మొదలయెది. అన్న సూత్రం ఆయనకు పూర్తిగా తెలిసో లేదా తెలిసినా ఆ సిద్ధాంతంతో ఆయన యేకీభవించడం అప్పటి చదువుకో వాలన్న తపన అయ్యుడొచ్చునేమో గూడా.రెండు పాములనుబోలిన తోలు బెత్తాలతోనందయ్య,,మందయ్య] సత్కార భయమో మమ్మల్ను తప్పులు వల్లించే
తీరాన్నుంచి దూరంగా జరిపేవి.ఆయన పారితోషికం నెలకు పది రూపాయలలోపే ఉండేది.కారణం ఆయన జీవనో పాధి శేద్యం.ఈ చదువుచెప్పడం ఆయన గారి ప్రవృత్తి. పిల్లలు గూడా రూపాయో అర్ధో నెల నెల చదివించుకునే వారు. ఇక శతకాలంటారా ఆయననోట శుద్ధంగా పలకబడదానికి సిద్ధమయేవి.రోజుకో పద్యమే చెప్పే వారు. అక్కడే నాలుగు సార్లు ప్రతివిద్యార్ధీ వల్లించే వారు.అందుకే దాశరధీ,భాస్కర,నరసిమ్హ శతకాలు తరగతుల వారీగా ఉండేవి. చిన్న తరగతుల్లోవెమన సుమతీ శతకాలు,కృష్ణ,కుమారీ [మగపిల్లలకు] కుమారీ శతకం చెప్పే వారు.యే పుస్తకాన్నీ చేతబట్టిన గుర్తూ లేదు.అలా మాకు పట్తుబడి ఇప్పత్లో నాలుకపై ఆడే పద్యాల ప్రాభవం ఆయన పెట్తిన భిక్షేనని ఒప్పుకుని గొప్పగా చెప్పుకోక తప్పదు.నాలుగోతరగతికొచ్చేసరికి పెద్ద బాలశిక్ష మాకు కరగ్రహణమై కళ కళ లాడేది.]సశేషం]
No comments:
Post a Comment