Saturday, April 30, 2016

ఆయనపేరు వీరారెడ్డి.స్వతహాగా ఏమీ చదువుకోలేదు.తన సంతానాన్నయినా చదివించి తృప్తిపడదామనుకుంటే నిస్సంతు.అలాగని మొహం ముడుచుకు కూర్చోలేదు.
ఉన్నతపాఠశాలలో ఒక గది కట్టాలంటే పాతికవేలవుతుంది.[1950-55] లనాటి పరిస్థితి.ఆడబ్బు తనే సమకూరుస్తానన్నాడు.ఆ గదికి ఆయన పేరు పెడతామంటే పేరుకోసంకాదు యేటా పదిమంది పిల్లలకు ఆగది ఆశ్రమయితే అదేచాలునన్నాడు.కానీ ప్రభుత్వం ఆయన పేరు పెట్టి తమవంతు కృతజ్ఞతతెలియజేసారు.ఓ బీద కుర్రాడిని మెడిసిన్ లో గుంటూరు వైద్య కళాశాలలో చేర్పించి అతని చదువూ నిరాటంకంగా సాయ పడ్డాదు. ఆకుర్రాడుగూడా 'మా నాన్న'నే పిలుచుకునే వాడు ఊళ్ళొనే పిల్లనిప్పించి సాయపడ్డా డు .ఎ చే బొ ము [ఎడమచేతి బొటనవేలి ముద్ర]అయినా ఎందరికో విద్యాగంధం పూసి తన జీవితాన్ని సార్ధకం చేసుకున్నాడు.
డబ్బులిస్తామని కాలేజీకి పేరు పెట్టించుకుని దబ్బులివ్వని మహా వదాన్యులు వున్న మన రాష్ట్రంలో ఇది అమూల్యమైన అత్యంత ఆదర్శప్రాయమైన కార్యమే కాదనగలమా. ఆవిద్యార్ధి కంటి వైద్య నిపుణునిగా పేరు బడసినారని చెప్పడానికి సంతోషపడుతున్నాను.ఇదీ మావూరు లోనిఓ వదాన్యుడికధ
============================================

Friday, April 29, 2016

మనిషిని బోలిన మనుషులుంటారా అంటే మాపోస్టుమ్యాన్ వెంకటేశ్వర్లుశివరావు  అనే తెలుగు సినిమాల్ల్లోనిపాత నటుడినీ ప్రక్క ప్రక్కగా నిలబెడితేఇద్దరుమిత్రుల్లో 'అక్కినేని నాగ్గాడును' సరిపోలేలా ఉంటారు.
అయితే విశేషం యేంటంటే మా 'పోలిశెట్టి అనబడే శివరావు, అందరికీ ఓ చిన్న "రాముల వారిదగ్గరుండే
హనుమంతుడులా'ప్రత్యక్షమై తన చేతనయినంత సాయం అందిస్తాడు.

మా చిన్నప్పుడు మా హైస్కూలు ముందు వాగుచిన్నపాటి వానకుకూడా ఒడ్డంటా ప్రవహించేది .అక్కడ ఈ శివరావు అనబడే ఆంజనేయుడు   [ తోకలేని]తయారయే వాడు.ఈ ఒడ్డునుంచి ఆ వొడ్డుకుపేద్ద మోకు ను లాగి అవతలైంకోమనిషిని పట్టుకోడానికి నిలబెట్టి అందరినీ అవతలి ఒడ్డుకుచేర్చే వాడు.మాకందరికీ స్కూలుకెళ్ళాలన్న ధ్యాస కన్నా ,నీళ్ళలో నడిచే అనుభూతి మమ్మల్ను కట్టి పడే సేది.అది ఆ శివరావుకి అందరిపైన ఉండే ప్రేమనే చెప్పుకోవాలి..సహకరించాలన్న ఆత్మీయత అతని తరగని ఆస్తులు,మా పోలిశెట్టికి ఓ మైకు సెట్టూ నాలుగు పె ట్రొ మాక్సు లైటులు  ఉండే వి.అన్ని శుభకార్యాలకూ &అద్దెకిచ్చి కొంత ఆదాయం పొందుతుండే వాడు.ఆమైకు సెట్టు కు అహుజా బాట్టరీ ఉండేది,నాలుగు గొట్టాలూ HMV రికార్డుల పెట్టే ఉండేది.ఓ పదేళ్ళు ఆ సరంజామా తో కాలక్షేపంచేసాక పోటీగా టేప్ రికార్దులసెట్టుతోమరొకడు అవతరించాక ఈ రికార్డుల భాగోతానికి క్రమేపీ తెరపడింది.
ఒక్కో సారి పెళ్ళిళ్ళ లో, బ్యాటరీ వీకయి పంతులుగారి గొంతు పీలగామారితే పురోహితూలవారిని ఆయన్ను ఓ గ్లాసుడుపాలు తాగమని
ఆ బ్యాటరీ పైన ఉండే ఆరు కానాల్లో సోడాలు గొట్టి పోసే వాడు,మళ్ళీ ఝామ్మని మైకు పాటలను బిగ్గరగొంతులో ఘనంగా అందుకునేది.
రికార్డులకంపెనీ వారు ఈ తిరిగే మట్టి రికార్డుల స్థానంలో క్రమేపీ టేపుల్లోకి దిగడ0తో ఈ వ్యవహారం మూత బడ్దా పెట్రో మాక్సులు కొన్న్నాళ్ళుబాగానే నడిచింది.ఈ లైట్లూ బాగా పాతబడి  మంగళసూత్రం కట్టే టైంకో,  తలంబ్రాల సమయానికో కొండెక్కుతామని మొరాయించి విసిగించేవి.
ఇక ఆ కార్యక్రమాలూ వెనుకంజ వేయడo మొదలెట్టాక బండి డాన్సు ల కాంట్రాక్టులు మొదలెట్టాడు.

బండి డాన్సులంటే అదేనండీ టైరు బండి బల్లపరుపు చక్కమీద వేదికగానిలిపి దానిపై యూరియా గొతాలు మందం గాను మెత్తగానుయూరియ గొతాలు మందంగాకప్పిదానిమీద అమ్మాయిలూ అబ్బయిలను ప్రక్క వూర్లనుండికొనితెచ్చి
 ఆడించే వారు.పల్లెల్లో అది ఓకాలక్షేపం అప్పట్లో.అదికొన్నాళ్ళు గడిచా  జనం ఆ బొడి[ ద్యాన్సు చేసే అమ్మాయికి
పేలొచ్చాయని వాళ్ళ అమ్మ్మా నాన్నా బోడిగుండు జేయిస్తే ఆ వచ్చి ఓ అయిదేళ్ళపాటు పేరు నిలబదిపోయిండి.
ఇక ఆతర్వాత అంతకన్నా కొత్త సినిమా పాటలతోనరసరావుపేట శివరాత్రి ప్రభలమీద రంగు రంగుల లైట్లతో
కళ కళగా ఒచ్చేక ఈ కళా పోలిసెట్తికి దూరమయింది.కొన్నాళ్ళు పోస్ట్ మ్యాన్లసంఘానికి గౌరవా ధ్యక్సుడిగా కూడా వెలగబెట్టి కొడుక్కు
 ఆశాఖలోనే ఉద్యో గం వచ్చాక ఆ పదవికీ దూరమై కొడుకు దగ్గర అత్తా కోడళ్ళ తగూలూ ధారావాహికంగా రావడం మొదలెట్టాక
దెభ్భయ్యో పడిలో ఆ ఉద్యోగానికి దూరమై పొన్నె కల్లులో ఉండడం ప్రారంభించాడు.
మేము స్కూల్లోచదివేవ్రోజుల్లో సైకిలుతొక్కడం నేర్చుకోవడం ఓ బ్రహ్మ విద్య అనుకుకునేవాళ్ళం.ఎస్సెల్సీకొచ్చినా
 సైకిలి తొక్కడం రాదంటే అవమానమని దొంగ చాటుగా సైకిల్ నేర్చుకోడానికి మా శివరావే ఆధారం.
శివరావు దగ్గర నాలుగుపెద్ద సైకిళూ న్రెండు చిన్న సైకిలుండేంది.కాళ్ళందాలంటే బండరాయి సాయంలేకుండా
చిన్న సైకిలే వాటంగా అందుబాటులొ వుండే ది.శివరావు లేనప్పుడు [అంటే పోస్ట్ బ్యాగులు తీసుకురావడానికి కొన్నాళ్ళు పొన్నెకల్లు
 కొన్నాళ్ళు సిరిపురం 10 గంటలకల్లా బయలుదేరివెళ్ళేవా డు.  మళ్ళీ అన్ని పనులూ ముగించుకుని వచ్చేసరికి
 నాలుగున్నర . అయిదో అయేది.ఈలోపు స్కూలునుంచి రాగానే వాళ్ళ నాన్ననో [రామస్వామి] లేదా తమ్ముడు వెంకటస్వామినో
 అడిగి తీసుకుని ఓ గంటతొక్కుకుని మోకాలి మోచ్చిప్పలు పగలగొట్తుకుని వచ్చే వాళ్లం .అలా వాళ్ళ నాన్న బాగా పె ద్దవాడవడం     మూలాన   తమ్ముడు తాగుడు  కలవాటు పడి డబ్బులెక్కల్లో తేడాలు రావడంతో ఆ వ్యాపారానికి మంగళం పాడాడు.

మా హనుమంతుడికి మొక్కలుపెంచడమ్మీద మహాశ్రద్ధ.మా రెండో అ బ్బాయి పెళ్ళికొచ్చినప్పుడు మాఇంటి తోటను జూసి గుండెలు బాదుకుని ఇల్లానా తోటను పెంచేదీంటూ గొప్పులుదీసి మొక్కలు నాటి[ఉన్నవే ఎండిన ఆకులనురాల్చి కొమ్మలను కత్తిరించి బాగపోషణజేసి మళ్ళీ పది పదిహేనురోజుల్లో ఎరువుతో వచ్చి వేసి ఎలా ంక్కలనెలా పెంచాలో చప్తాను అంటూ, మళ్ళీ తనొచ్చేటప్పుడు ఓ మల్లె మొక్కనూ, గోరింటమొక్కనూ తెచ్చినాటి వాటికి సంతుష్టిగా గొర్రె పెంటనుదెచ్చి ఎరువుగా ఏసి నీళ్ళు పెట్టి మళ్ళీ పదిరోజులకొచ్చి మొక్కలు కాస్త నిలదొక్కుకోవడంచూసి తృప్తిపడి వెళ్ళాడు,ఆతవాతమళ్ళీ ఓ నెలకొచ్చి అక్కదక్కడాపెరిగిన గడ్దిని,కలుపుమొక్కలనూ పీకి,గోరింట కొమ్మలు విరువకండా ఆకులుమాత్రంకోస్తూ కాసిని నీళ్ళు అప్పుడప్పుడూ చిలకరిస్తే బాగా అల్లుకుపోయిపెరుగుతుందనీ చెప్పి ఏందుకు ఇంతహ్=గా శ్రమకోర్చి త్చ్చావు వెంకన్నా అంటే నాది శ్రమేముందబ్బాయ్ బస్సువాడే గదామోసేది,మనం టిక్కట్ కొనికూర్చు0టే వాడే మోసుకొచ్చడని తొర్రిపళ్ళలోంచి నవ్వి అమ్మాయికి[మా ఆవిడకి] మల్లెపూలూ,గోరింటా కూ ఇష్టమని మా ఆవిడ ఇచ్చి పంపింది
నేను తే చ్చి నాటాను అంతే అని నవ్వే వాడు

ఆమల్లె చెట్టు రెండురోజుల్లో రెండువందలు పైగా ముద్ద గా  పూలనుపూస్తే ఆవిడానందంగా     లక్ష్మి అమ్మవారికీ లలితమ్మ వారికీ అష్టోత్తర    శతనామ పూజలను దీక్షగాజేసి కుదుటబడింది.ఈమల్లెలెంత ఘుమలాడుతున్నాయో చూడండి అని తను అంటే రావెల వారిసంస్థానమంటే ఉన్నగొప్ప అల్లాగే ఘనంగా ఉంటాయిఏదయినా అని ఓ మా టి వదిలి నవ్వుకుకున్నాను ముసి ముసిగా.

మానాన్న[గారు] పోయినప్పుడు అతన్ని దు ఖాన్ని ఎవరూ ఆపలేకపోయాం.పెద్ద పంతులుగారు[పెద్దనాన్న]మంచానబడి దాటిపోయారు,
ఈయనకేంతొందరొచ్చిందని తిరుగుతూ తిరుగుతూ ఉన్న మనిషి ఇలా పోతే నాకు మంచీ చెడు చెప్పేదెవరు? అని పెద్దగా శోకండాలు
పెడుతుంటే వచ్చి  న  వాళ్ళందరికీ "వీడురానిజమైన బంటంటే "అని నోరు నొక్కుకున్నారు.

మళ్ళీ నెలరోజుల్లో ఒస్తానని వెళ్ళాడు. సంక్రంతికొచ్చాడూగదా అని అతనికి కొత్త ధోవతీ,పైపంచా
 పెడితే తీసుకోనంటే తీసుకోనని గొడవ.ఆవిడేంఓ వాళ్ళావిడకని ఓ కొత్తచీరా జాకెట్ ఇచ్చి పంపింది అతనితో. ఎంతో మురిసిపోయాడ
 మళ్ళే ఆవిడత్ఫో వస్తానని వెళ్ళీనవాడు అందరినే ఇక్కడె వదిలి ఒక్కడూ ఒంటరిగా వాళ్ళ పంతులుగార్ల దగ్గరకు వెళ్ళాడూ
.అక్కడ వాళ్ళమ్మాయి గారు కలిస్తే ఈ పూలమొక్కలన్నీ వదిలి మా అబ్బాయిని ఒ0రిగాడిని చేసీ ఎలా చ్చావమ్మా అని అడిగే వుంటాడు ఆ దివ్యధామంలో.
-----------------------------------------------------------------------------------------------------------------------------

తా.క : అతన్ని  గూర్చి ఓ మాట చెప్పడం మరిచాను.
అతను మట్టిమిద్దె ఇంట్లోనుంచి నేతమగ్గాన్ని వదిలి పూరిగుడిసెలో అద్దెకు మారడమతని నీతికీ నిజాయితీకి నిదర్శనగా చెప్పుకోవచ్చు.ఒక సిద్ధాంతానికి కట్టుబడి పనిజేస్తే చివరకు మిగిలేది శుద్ధ పేదరికమేనని గ్రహించిన జ్ఞాని అతడు.

-----------------------------------------------------------------------------------------

Monday, April 4, 2016

మంచి ఉపాధ్యాయుడంటే బీయేలూ ఎమ్మెలు చదవడమో, బీ ఈడినో ఎం ఈడీ డిగ్రీలు పేరు వెనుక తగిలించుకోవడమో కానే కాదని రుజువు చేసిన వాళ్ళు,నాలుగయిదు డశాబ్దాలక్రితం అసంఖ్యాకంగా దొరుకుతారనీ, వాళ్ళు వేసుకునే బట్టల ద్వారాకూడా ఆ గౌరవం
అధికస్య అధికం ఫలమన్న రీతిలో ఉండదనీ,జాతీయ స్థాయిలోనో
రాష్ట్ర స్థాయిలోనో ఉత్తమ ఉపాధ్యాయుడిగా పెరూ
బిరుదులోపురస్కారాలవేటో వారిని ప్రభావితం చెయ్యలేవని నేను గాఢంగా నమ్మ వలసిన అవసరం మావూళ్ళో కోమటి వీరయ్యగారిని చూసిన ఎవరికయినా ఇట్టే అర్ధమయిపోతుందని నా గట్టి నమ్మకం.వాళ్ళు ప్రభుత్వమిచ్చే దివ్యమైన జీతాలప్రభావం కానే కాదని ఇట్టే అందరికీ అవగరమౌతుంది,

ముతక ఖద్దరు బట్టలలో[ఇరవై నంబరనే వాళ్ళని గుర్తు.]
అప్పటికే కొంత తెల్లబడినమీసాలతో బాగా చిలికిన వెన్నా మీగడలందించిన దేహ పుష్టితో అలరారే మూర్తి విగ్రహం ఆయనది. ఉదయం ప్రారంభంలో సరస్వతీ నమస్తుభ్యంతో --- మొదలెట్టి మసక మసక చీకటి పడకముందే దీపంజ్యోతి పరబ్రహ్మం శ్లోకాన్ని

వల్లించమంటూ మాతో గొంతు కలిపే దాకా ఆయన చదువు చెప్పడంకొన సాగేది.మాకు ఇప్పటిలా బండెడుపుస్తకాలను మోసే అవసరమూ ఉండేదిగాదు.ఓమట్టి పలక[మార్కాపురం పలకలనే వారు] ఆరర్వాత కొంత కాలానికి రేకు పలకలు లొతలొటలాడుతూ వచ్చాయి. ఆపెద్ద పలకలోనే అన్ని సబ్జెక్ట్ల సారం రంగరించ బడి ఉండేవి.అప్పట్లో ఆయన ఎక్కాలు చెప్పడం అప్పగించుకుమే తీరు చాలా భిన్నంగా
వుండేది.పిల్లలమే ఒకరికొకరం ఎదురెదురుగా నిలబడి

అప్పజెప్పుకుంటూఉంటే దీక్షతో ఆయన బహు ఏకాగ్రతతో గమనించే వారు.తప్పు చెప్పామా చింత [సగం పచ్చిది] బరికెతో సన్మానం
మొదలయెది. అన్న సూత్రం ఆయనకు పూర్తిగా తెలిసో లేదా తెలిసినా ఆ సిద్ధాంతంతో ఆయన యేకీభవించడం అప్పటి చదువుకో వాలన్న తపన అయ్యుడొచ్చునేమో గూడా.రెండు పాములనుబోలిన తోలు బెత్తాలతోనందయ్య,,మందయ్య] సత్కార భయమో మమ్మల్ను తప్పులు వల్లించే

తీరాన్నుంచి దూరంగా జరిపేవి.ఆయన పారితోషికం నెలకు పది రూపాయలలోపే ఉండేది.కారణం ఆయన జీవనో పాధి శేద్యం.ఈ చదువుచెప్పడం ఆయన గారి ప్రవృత్తి. పిల్లలు గూడా రూపాయో అర్ధో నెల నెల చదివించుకునే వారు. ఇక శతకాలంటారా ఆయననోట శుద్ధంగా పలకబడదానికి సిద్ధమయేవి.రోజుకో పద్యమే చెప్పే వారు. అక్కడే నాలుగు సార్లు ప్రతివిద్యార్ధీ వల్లించే వారు.అందుకే దాశరధీ,భాస్కర,నరసిమ్హ శతకాలు తరగతుల వారీగా ఉండేవి. చిన్న తరగతుల్లోవెమన సుమతీ శతకాలు,కృష్ణ,కుమారీ [మగపిల్లలకు] కుమారీ శతకం చెప్పే వారు.యే పుస్తకాన్నీ చేతబట్టిన గుర్తూ లేదు.అలా మాకు పట్తుబడి ఇప్పత్లో నాలుకపై ఆడే పద్యాల ప్రాభవం ఆయన పెట్తిన భిక్షేనని ఒప్పుకుని గొప్పగా చెప్పుకోక తప్పదు.నాలుగోతరగతికొచ్చేసరికి పెద్ద బాలశిక్ష మాకు కరగ్రహణమై కళ కళ లాడేది.]సశేషం]