Wednesday, March 23, 2016

కొన్నిపేర్లు వినడానికే విచిత్రంగా ఉన్నట్లనిపించినా
వారి స్ఫూర్తిమంతమైన జీవితం-- మార్గదర్శకంగా నిలుస్తుంది.
అటువంటివారిలో చెప్పుకోదగిన వ్యక్తి ధన్ గారు--
గుంటూరును ఒక విద్యానగరంగా తీర్చిదిద్దిన ఘనత ఆయనదే--
క్రమ శిక్షణ  కు మారుపేరుగా వుండే వారు-- విద్యార్ధులపట్ల సిమ్హస్వప్నంగా వుండే వారు--ఆయన దగ్గర శిక్షణ  తీసుకున్న ఎంతో మంది పేరుగడించిన వైద్యులుగా ఇంజనీర్లుగా ఉపాధ్యాయులుగా
దేశమంతటా విస్తరించి వుండడం ఆయనకున్న కీర్తికిరీటంలోఅది కోహినూరు వజ్రమే--
సాహిత్యంపట్ల లలిత కళలపట్ల మక్కువ.
అంతశెముషీఖని దగ్గర పనిచే  సినవారు,ఎందరో విద్యానిలయాలను ఏర్పరచుకుని ఖ్యాతినందిన దాఖలాలు ఎన్నెన్నో--అసంఖ్యాకం--

ఒకప్పుడు రవి కళాశాల గుంటూరు పట్టణంలో ఓ కొండగుర్తుగావుండేది. ప్రవేశపరీక్షలకు .దేశ విదేశాలనుండి
ఇక్కడకు వచ్చి శిక్షణ తీసుకోవడం ఆయన ప్రతిభకు తార్కాణం..

అప్పట్లో దేశంలో పేరున్న ప్రొఫెసర్లను ప్రఖ్యాత విశ్వ విద్యాలయాలనుండి తెప్పించి విద్యార్ధులకు  శిక్షణనిప్పించేవారు
గుంటూరు మణిహారంలో కోహినూర్ వజ్రంగా మనం శ్లాఘించదగిన
చెన్నావఝల విశ్వనాధంగారే ఆ మహితాత్ముడైన సి.వి.యన్ ధన్..

No comments:

Post a Comment