Wednesday, March 30, 2016

లేవుగనుక ఎడ్లబండిగట్టుకుని వెళ్ళే వాళ్ళం.నాతోపాటు ఇప్పుడు డాక్టరయిన మధుసూదనుడు తొడయే వాడు.బండి జల్లలోనో ముందు తొట్టిలోనో దుప్పటికప్పుకుని దాక్కునే వాళ్లం. బండి కొంతదూరం వెళ్ళాక మమ్మల్నుగమనించినా ఇంకచేసేదేంలేదుగనుక ఊరుకునే వాళ్లు పోనీలెమ్మని.ముఖ్యంగా మాకు సత్య హరిశ్చంద్ర నాటకమంటే
చచ్చేంత అభిమానం. అందులోముఖ్యంగా కొన్నిపద్యాలు మమ్మల్ను బాగా ఆకర్షించేవి మొదటగా తిరమై సంపదలెల్ల రెండోది
మాయామేయజగంబు--మూడోది, దళమౌ పయ్యెదలోనడంగియును-- ఇవిగాక కాటిసీనులోని జాషువా గారి పద్యాలు బాగా కదిలించేవి.
ముఖ్యంగా నక్షత్రకుడిగా పులిపాటి వెంకటేశ్వర్లు గారు,తమ్ముడు [లక్ష్మీ నారాయణని గుర్తు] వేస్తుంటే విశ్వామిత్రునిగా మందపాటి రామలింగేశ్వరరావుగారు అద్భుతమైన వాచకంతో అలపించేచేవారు.

ఆసమయంలోనే 'శివశ్రీ'యని ఓ కొత్తనటుడు హరిశ్చంద్రుని వేషంవేసేవాడు.అతనిది తణుకో బందరో బాగా గుర్తులేదు.

ఆ' కింకరుడే రాజగు రాజె కింకరుడగున్ --'అన్న మాటలను నాటకంలో
పదే పదే సందర్భానుసరంగా పదే పదే అనడం బాగా నప్పింది.

మా పెదనాన్న గారికి ఈ నాటకాలంటే ఎక్కువ ఇష్టం.స్వయంగా పాదుకా పట్టాభిషేకమనే నాటకమ్రాసి ఊరిలోని వాళ్ళతో ఆనాటకాన్ని పలు చోట్ల ప్రదర్శించి ప్రశంసలనందుకున్న ఘనుడాయన. ఈ నాటకంలో దశరధుడివేషం వేసి జనంచేత కన్నేఏళ్ళను పెట్తించేవారని చెప్పుకునే వారు ఆయన్నుగురించి.
============================================================

Wednesday, March 23, 2016

కొన్నిపేర్లు వినడానికే విచిత్రంగా ఉన్నట్లనిపించినా
వారి స్ఫూర్తిమంతమైన జీవితం-- మార్గదర్శకంగా నిలుస్తుంది.
అటువంటివారిలో చెప్పుకోదగిన వ్యక్తి ధన్ గారు--
గుంటూరును ఒక విద్యానగరంగా తీర్చిదిద్దిన ఘనత ఆయనదే--
క్రమ శిక్షణ  కు మారుపేరుగా వుండే వారు-- విద్యార్ధులపట్ల సిమ్హస్వప్నంగా వుండే వారు--ఆయన దగ్గర శిక్షణ  తీసుకున్న ఎంతో మంది పేరుగడించిన వైద్యులుగా ఇంజనీర్లుగా ఉపాధ్యాయులుగా
దేశమంతటా విస్తరించి వుండడం ఆయనకున్న కీర్తికిరీటంలోఅది కోహినూరు వజ్రమే--
సాహిత్యంపట్ల లలిత కళలపట్ల మక్కువ.
అంతశెముషీఖని దగ్గర పనిచే  సినవారు,ఎందరో విద్యానిలయాలను ఏర్పరచుకుని ఖ్యాతినందిన దాఖలాలు ఎన్నెన్నో--అసంఖ్యాకం--

ఒకప్పుడు రవి కళాశాల గుంటూరు పట్టణంలో ఓ కొండగుర్తుగావుండేది. ప్రవేశపరీక్షలకు .దేశ విదేశాలనుండి
ఇక్కడకు వచ్చి శిక్షణ తీసుకోవడం ఆయన ప్రతిభకు తార్కాణం..

అప్పట్లో దేశంలో పేరున్న ప్రొఫెసర్లను ప్రఖ్యాత విశ్వ విద్యాలయాలనుండి తెప్పించి విద్యార్ధులకు  శిక్షణనిప్పించేవారు
గుంటూరు మణిహారంలో కోహినూర్ వజ్రంగా మనం శ్లాఘించదగిన
చెన్నావఝల విశ్వనాధంగారే ఆ మహితాత్ముడైన సి.వి.యన్ ధన్..

Thursday, March 17, 2016

ప్రజల వద్దకు పాలన పేరుతో గతంలో ఇప్పుడు ఏలికలే
అందరినీ భయభ్రాంతులకు గురిచేసి జవనాశ్వంపై దౌడు తీస్తున్నరోజులు.
అందునా ఆయనేమో-- రైతు బాంధవుడు.. ఢిల్లీలో సభ్యత్వం వున్న పెద్ద మనిషి..

నేనా ఒక శాఖకు నిర్వహణాధికారిని రోజూ పగలనకా రాత్రనకా ఫోన్లో సతాయించేవాడు--- తీరా ఆ రుణం దేనికంటే గ్రామోదయ పధకంక్రింద నిరుద్యోగ
యువకుడికి అక్షరాలా 3 లక్షల లోనుకోసం.. వ్యాపారం వుల్లిపాయలు--
అప్పట్లో కిలో రెండు రూపాయలు--అంత సొమ్ముపెట్టి కొన అవన్నీ ఎక్కడ దాచాలి?
ఇవన్నీ ఆలోచిస్తే అది నిలబడే వ్యాపారంకాదని అర్ధమయింది.. మాదగ్గరే
ఖాతావున్న హోల్ల్సేల్ వ్యాపారినడిగాను-- చాలా కష్టంసార్--సరుకు తొందరగా ఈసారెందుకు కుళ్ళిపోతున్నది మేమే తగ్గించి రోజుకు 10-15  వేలు మించి తెప్పించడంలేదు అన్నాడు--సరే మళ్ళీ పెద్దదొరగారిఫోను-- సరే తేల్చి చెప్పక తప్పిందికాదు--ఒక పాతికవేలు మించి ఈ లోను ఇవ్వడంకుదరదు అని..ఇక దొరగారు అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు--మరి మీవాళ్ళు హర్షద్ మెహతాకు అంత ఎట్లా ఇచ్చారు అన్నాడు? సారీ సార్ ఆలోను నేనివ్వలేదు ఎవరు ఎట్లా ఇచ్చారో నాకెరుకలేదు--కానీ మీరు 2 సంవత్సరాలక్రితం మీ పార్టీవ్యక్తికి ఈ శాఖ ద్వారా 50 వేలు ఇప్పించారు--
సిమెంట్  కొట్టుకని కొట్టూలేదు డబ్బు కట్టడంలేదు--ఇప్పుడేమో ప్రభుత్వం క్రిమినల్ కేసు పెట్టమంటున్నది,ఆదరఖాస్తుకు మీ రికమండేషన్ లెటర్ జతచేసివుంది ఒకసారి మీతో చెప్పి రేపు క్రిమినల్ కేస్ ఫైల్ చేదామనుకుంటున్నాను,ఒక పదివేలయినారేపు కట్టించండి లేకపోతే మీపేరూ బయటకొచ్చేలావుంది అన్నాను.. అంతకుముందు ఆలోను విషయం లోక్ సభలో ప్రస్తావిస్తానని బెదిరించిన వ్యక్తి మరునాడు పొద్దున బ్యాంకు తలుపులు తీసేలోపు ఆ రుణగ్రహీత హాజరయేలా చేసి నానెత్తిన పాలుబోసాడు-అది సుతా మళ్ళీ నాకుఫోనొస్తే వొట్టు--

Tuesday, March 15, 2016

మాగుంటూరి గోంగూర లాంటి
రుచికరమైన గొప్పలు
[అవీ ఇవీ అన్నీ కలగాపులగంగా]
కాచుకోండి ఇక ధారా వాహికంగా
జీడిపాకాన్ని మరపించే
 అత్యద్భుత రచనా వ్యాసంగం
ముందస్తుగా  గోంగూరా దాని పుట్టు పూర్వోత్తరాలతో విందులను
కమ్మగా నోటికి అపథ్యంగా వినిపించి అలా గంతులేసుకుంటూ
ముందుకడుగులేస్తూ కబుర్లనూ [కాకర కాయలొద్దులేండి--చేదు--
గాధా సప్తశతిగా అల్లుకుపోతూ ,మధ్యమధ్యలో సాహిత్యాన్నీ
ఆనాటీ జీవనగమనాన్నీ నెమరువేసుకుంటూ ముందుకు సాగుదాం!
ఉపోద్ఘాతం ఇలా బంగాళా ఖాతంలా సాగితే ఎంఉంటుంది మజా[కా]
అనుకోమండి ఆలశించిన ఆశాభంగము--స్త్రీలకు ప్రత్యేకపు
స్థలములు గలవు త్వర పడండి--ఆలశించిన ఆశాభంగము మరువకండి. మీకు తెలిసిన గుంటూరును మెచ్చే సహృదయంగల అందరితోనూ ఈ రుచికరమూ ఆరోగ్యప్రదమూ ఐన మాటా మంతీని మనసారా పంచుకోండి. నువ్వేంది చెప్పేదీ గోంగూర అనుకోకండి.
కొపమొచ్చిన కొందరు[కారంతినే నోళ్ళుగదండీ అలానే అంటుంటారు
మా వాళ్ళు మన్నించండి,పండుమిరప్పళ్ళతో నూరిన నోరూరించే
గోంగూర పచ్చడి తిననంత వొట్టు-- [సశేషం]

Thursday, March 10, 2016

ఇక వరమ్మదగ్గరకెల్దాం

-------------------------------
మావూరిముందరతోపులో ఓ వీరాంజనేయస్వామి వారి  గుడివుంది
మావూరు వారంతా శనివారంవస్తే గుడికి వచ్చి ప్రదక్షిణలుజేసి
మనసారా భగవంతుడినిప్రార్ధించుకుని వెళ్ళే వాళ్ళు.
మనసుకు బాధకలిగినా మనసులో మనసులేకపోయినా
మావూరి   దాక్టర్గారి దగ్గరకెళితే మందులతో పాటు
ఆంజనేయస్వామికి 40 ప్రదక్షిణలు ఓ మండలంపాటు చేయమని సెలవిచ్చే వారు.
 వాళ్ళకు ఆ జబ్బు కుదిరి కుదుట పడేది.
అదంతా ఆ భగవంతుడి దయే నని అనుకునే వారు.అది తప్పని ఎవరూ
భేదాభిప్రాయం వ్యక్తం చేసే వారూ కాదు.ఇక అక్కడ యే శుభకార్యం ఇంట్లో జరిగినా అనుకున్నది జరిగినందుకు 5 కొబ్బరికాయలు కొట్టిమొక్కును తీర్చుకునే వారు. శనివారం నాడు
ఆకుపూజలు జరుగుతూ ఉండేవి. భజనలూ అవీ జరుగుతుండే వి.
తొలకరినాడు పొలంపనులు ఆయన దగ్గరనుంచే ప్రారంభమయేవి.

మూడేళ్ళకో నాలుగెళ్ళకో ఆంజనేయస్వామిని అందంగా అలంకరించే వారు రకరకాల రంగులతో డ్రాయింగ్   మాస్టారు  క్రిష్ణారావు. ఆతర్వాత చిన్నసైజు ప్రభలుగట్టి యాదవ యువకులు గులాము జల్లుకుంటూ కోదె గిత్తలను విగ్రహంచుట్టూ ప్రదక్షిణలు జేయించేవారు. ఈమధ్య వాళ్ళే రoగులు
స్వామివారి విగ్రహానికి  వేయడంకూడ కద్దు.
చాలా సంవర్సరాలపాటు పైకప్పుకూడాలేకుండానే వుండేది.[సుమారు 70 యెళ్ళనాడు,తుర్లపాడునుంచి మావూరికి తరలి వచారని మాత్రం తెలుసు.అక్కడ బావిలో విగ్రహం దొరికిందని అన్ని వూళ్ళ వాళ్ళూ
ఎడ్లబండ్లుగట్టుకుని వెల్లారట. మావూరివాళ్ళూ నలుగురితో నారాయణ అనుకోకుండా భిన్నంగా ఉపవాసముండి, భజన బృందంతో
ఆవూరికి వెళ్ళారట. ఎవ్వరు తీద్దామని ప్రయత్నించినా రాని విగ్రహం మావూరి వారి భజనల ప్రభావమో భక్తి తత్పరతలకు మెచ్చో ముఖ్యంగా పెద్ద డాక్టర్ సుబ్బారావుగారూ, మదీయ తండ్రిసుబ్బారావూగారల కృషీ చిన్న డాక్టర్ కృష్ణమూర్తిగారి కృస్సంకల్ప బలం వుందని వూరంతా గొప్పగా చెప్పుకోవడం మాత్రం విన్నము.
ఇక అసలు విషయానికొస్తే ఈ వరమ్మా ఆ అంజనేయ స్వామికి అనుంగు భక్తుతాలు. శనివారం నాడు ఆ స్వామివారు ఆమే వొంటిమీదకొవ్చ్చే
వారు.అది ఆమె భక్తి కావొచ్చు అధునాతన సాంకేతిక విజ్ఞానం వల్ల మానసిక రుగ్మతా కావొచ్చు. ఆరోజుల్లో మాత్రం అందరూ అది ఆమె ఒంటిమీదకు దేవుడు రావడం శుభ సూచకమేనని భావించే వారు. భవిష్య వాణిలా ఎమీ చెప్పిన దాఖలాల్లేవుగాని ఆ కొద్ది నిమిషాలూ[ఒ 15 నిమిషాలు] మన స్వరంతిలో ఉండేదికాదన్నది మాత్రం వాస్తవం. ఆ తర్వాత అరచేతిలో హారతికర్పూరంబిళ్లలువెలిగించుకునేది. అక్కడె వున్న వేపచెట్టు ఆకులు గుప్పెడు దాకా తింటుండెది. ఎవ్వర్రూ వరసతోపిలిస్తే మాత్రం విపరీతంగా కోప్పడేది. "ఎవరురా నీకు అత్త నేనిప్పుడు సిoహాద్రి వరమ్మను కాదురా వెధవా !!" అని కసురుకునేది. మాచిన్నపుడు ఈ సంఘటనలు అనేకం చూసాం గనుక కించిత్తు భయంతో అసంకల్పితంగా వణుకు పుట్టడం గూడా జరిగేది.

=======================================================