Saturday, May 7, 2016

'మదర్స్ డే' అన్న దినోత్సవాలు ప్రారంభంగాకమునుపే
నాకు తెలిసిన ఓ మాతృమూర్తినిగూర్చిన పరిచయం చేస్తాను.
అప్పట్లో ఆంధ్ర ప్రభలో మాలతీ చందూర్గారి ప్రమదావనం ప్రతివారం వస్తున్న రోజులు.ఆమే తీరిగ్గా ఆ శీర్షికకు కార్డుముక్క రాసిపడేస్తే అది రెండు మూడు వారాలతర్వాత ప్రచురితమయేది. ఒక్కోసారి పొడి అక్షరాలతో ఇంకో సారి
పూర్తి పేరుతో ప్రశ్న అడిగినవారి పేర్లు ప్రచురితమయేవి.ఆరోజుల్లో
నెలకొకసారయినా తప్పక ఆమే పేరుతో ఓ ప్రశ్న--దానికి మాలతీ చందూరు గారి అమ్మూల్యమైన జవాబూ ప్రచురితమయేది.ఆమె ఎప్పుడూ తనకు సంబంధించిన ప్రశ్నలు అడిగినట్లనుపించేది కాదు.
తనచుట్టూ ఉన్నవారిని గురించిన సమస్యల పైనే ప్రశ్నలుండేవి.
ఇదంతా ఎందుకు చెప్పోచ్చానంటే కొన్ని అగ్ని పర్వతాలు అప్పటికే ఆమె
గుండేల్లో నివాసముంటూ అప్పుడప్పుడూ భయపెడుతూ వుండేవి.అయినా ఆమే మూర్తిమంతమయిన రూపంలో ఎక్కడా తన వ్యక్తిగతమైన బాధలను గూర్చిన విషాదం తొణికిసలాడేదికాదు.అంత నిబ్బరంగా ఉండగలగడం అందరికీ సాధ్యమవుతుందని నేననుకోను.ఆ స్థిత
ప్రజ్ఞత్వం కొందరికే పరిమితమేమోననిపించేది.మగపిల్లలిద్దరూ బాగా ఎక్కొచారు.తాము నమ్ముకున్న సిద్ధాంతాలకు కట్టుబడిపోయారు.అది తన విశ్వాసాలకు అతీతమైన వాళ్ళధోరణిని ఆమె ఎప్పుడూ అడ్డుపడిన దాఖలాకనబడలేదు.ఆడపిల్లలల్లో పెద్దవాళ్ళిద్దరికీ యోగ్యమైన ఉద్యోగాలు చేస్తున్న వారికే ఇచ్చి చేసారు.అలా రెండు దశాబ్దాలుతిరిగేసరికి రెండో అమ్మయి స్వర్గస్తురాలయింది.అలాకొన్నాళ్ళకుని అయిదో అమ్మాయి వర్ణాంతర వివాహంచేసుకుని దూరంగా వెళ్ళిపోయింది.ఒకమ్మాయి పూర్తిగా ఈప్రపంచంతో సంబంధ బాధవ్యాలు లేనట్తుగా తన మనోవైకల్య ప్రపంచంలో తాను ఉంటుండేది. ఒక్కోసారి యేం బాధ కలిగిదోఆ పిచ్చితల్లి అఘాయిత్యాలు చేసుకునేది.[కిరసనాయిలు పోసుకుని అంటించుకోబోయింది.ఇలా జీవితం ఒడుదుడుకుల మార్గంలోనే నడుస్తున్నరోజుల్లోనే పెద్దమ్మాయి భర్త అకాలమరణానికి గురయాడు.అప్పట్లో అంత నింపాదిగా వున్న మనిషి ఇప్పుడు భర్తృవిహీనకూడా అయి మగ పిల్లలదగ్గర తన శేషజీవితాన్ని వెళ్ళదీస్తూ వుంది.ఒక్క సారి వీలయితే ఆమెను కలుసుకును నాల్కో ఇన్ని ఆటుపోటులు ఎదురుకో గలిగిన ధైర్యాన్ని పరోక్షంగా అందించిన ఆమె వ్యక్తిత్వానికి పాదాభివందనం చేయగలిగితే ఎందరో మాతృమూర్తులకు ఆదర్శంగా నిలువగలిగినందుకు కృతజ్ఞతాపూర్వకంగా మనమేమివ్వగలం రెండు అశ్రువులను ఆమె పాదాలమీద అసంకల్పితంగా రాల్చగలగడం తప్ప.
ఇల్లాంటి ఎందరో మాతౄమూర్తులున్నారు.ఈభూదేవంత సజనంతో తమ జీవితాలను వెళ్ళదీస్తూ .వారందరినీ ఈ వదన గ్రంధం ద్వారా స్మరించుకో గలగడమే మనకు పుణ్యమని గుర్తెరగాలి.
==========================================================================
ఒక్కోసారి సొంత అమ్మలు జీవిoచిలేనివారిని గురించి దీర్ఘంగా ఆలోచిస్తే,ప్రేమాభిమానాలను
పంచడానికి స్వంత పిల్లలేకానక్కర్లేదని చెప్పగలిగిన వ్యక్తుల్లో మా మహలక్షమ్మ ఆమ్మ [మా పెదనాన్నగారి భార్య] మొదటివరుసలోకొచ్చి కూర్చుంటుంది.తన మరది పిల్లలమైన మమ్ములలను
కడుపులో పెట్టి చూసుకునేది అని చెప్పడంలో సందేహమేమీ లేదు. ఇప్పటిలా గ్యాస్ స్టౌవ్లూ లేవు
కుక్కర్ల ఊసూ తెలియదు.మాఊహకు తెలిసిందల్లా పొట్టుపొయ్యిలూ, కట్టెలపొయ్యిలూ. బొగ్గులకుంపట్లు కూడా ఇంకా ప్రచారంలోకి రాని రోజులు. వండనలయదు వేవురు వచ్చెనేని అన్నరీతిగా రోజూ
అయిదారుగురు తక్కువకాకుండా [ఇంత్ళో పిల్లలతోసహా ఉన్న పదిమందీకాక] ఉంటుండేవారు.
కర్ణం గారిల్లు కదా యే అదికారిఒచ్చినా, కులంతో పరిమితంగాకుండా భోజనానికి యేర్పాట్లు జరిగేవి. ఇదిగాక నాలుగు బర్రెల పాడి ఎప్పుడూ రెండు పాడిగానూ రెండు సూడిగానూ ఉంటుండేవి.ఆవులూ ఉండేవి వాటిని మేపుతామని తీసుకెళ్ళిన వాళ్ళు కొండమీద దొర్లిపడ్డాయని చెప్పి అమ్ముకునేవారు, అ 0 దుకని వాటినిపోషించే వసతిలేక అమ్మేసారు. ఇది గాక పొలంపనులు ఉన్నరోజుల్లో ఒకల్లో ఇఫ్ద్దరికో చద్దిమూఅలాగా అన్నం పంపాల్సి వుండేది. మాపెదనాన్నగారు పోయాక [1985 లో]
ఆవిడ మాదగారకొచ్చి గుంటూరులోనే వుండేది. మహ్యాహ్నం రెండుగంటలకు అందరూ తిన్నరనుకున్నాక ఆమె ఎంగిలిపడేది. పూజాపునస్కారాలూ మెండు.ఒంటిగంటదాకా పూజలు చేసుకునేది.
సాయంత్రం ఇరుగుపొరుగూ అమ్మలకాలను కూడదీసుకుని, భారత రామాయణాలు చదివి వినిపించేది.
చదువుకున్నది తక్కువేనయినా సంస్కారం ఎక్కువనిపించేది నాకు ఆమెను చూసినప్పుడల్లా!
ఆవిడచెప్పిన జీవన సూత్రాలు మా ఆవిడకు మంత్రాల్లా పనిజేసి అందరికీ తలలో నాలుకలాగా
ఉండగలిగేందుకు బాగా సాయపడ్డాయి, కన్నవారింటికష్టసుఖాలు కడుపులో దాచుకోవాలి, మెట్టినింటివారి ఇంటివిషయాలు మెదడు దాటిరాకుండా జాగ్రత్త పడాలి.ఇరుగు పొరుగుతో ఎప్పుడూ పొరపాటునగూడా మన ఇంటివిషయాలు పొక్కకూడదు.ముగ్గురుకోడళ్ళలో ఒకరి సంగతి ఇంకొకరితో


చెప్పడం ఆమే నైజానికి విరుద్ధమని తెలుసు.మమ్మల్ను మరిది పిల్లలని ఎప్పుడూ పిలిచేదికాదు, ఇతరులతో అలా అనేదీకాదు.నాపిల్లలే అన్నట్లు మాట్లాడేది. ఆమె మజ్జిగ చిలికుతుంటే అది రొజూ ఓ గంటకార్యక్రమం చుట్టూ చేరితే వెన్నను ముద్దలుగాజేసి పెట్టేది వేది అన్నం మీద మీగడవేసి తినండిరా పెద్ద చదువులకు వెళిటే బలముండాలిగదా! అనేది. ఆమే తమ్ముడు బావ మరది.పెద్ద చదువులు చదివి ఉ UNESCO లో ఉద్యోగం చేస్తుండేవాడు.రాయబారిగా ఇండియాకు వస్తాడనుకున్న సమయంలో కాలధర్మం చెందాడు. నందిరాజు వాళ్ళు. డిల్లీ స్కూల్ ఒఫ్ ఎకనమిక్స్ లో 50 వదశకంలో యెమ్మే చేసాడు, అటువంటి మాతృ మూర్తులను ఈ రోజుల్లో తలుచుకోగలగడం విశేషంకదా!
========================================================

Monday, May 2, 2016

పిల్లలూ దేవుడూ చల్లనివారేనని మనమనుకుంటున్నా కొందరు మనుషుల్లో దేవుడున్నాడనెది .కొన్ని యదార్ధ సంఘటనల ద్వారా నిరూపితమైనప్పుదు వాటిని కొట్టిపారేయలేం. ముఖ్యంగా ఒక వ్యక్తి జీవితంలోమలుపుత్రిప్పే సంఘటన జరిగి తలలు బద్దలు గొట్టుకునే సమయంలో ముక్కూ మొహం తెలియని వ్యక్తి ఒక్క మాట సాయంతో ఆసంఘటనకు విరుగుడుమంత్రం వేసి అమృతోపమంగా తీర్చి దిద్దగలిగినప్పుడు ఆవ్యక్తి దేవుడుతో సమనమనో ఒక ఆకు ఎక్కువెననో మనం అనుకుంటే తప్పేమీ లెదని నా అభిప్రాయం. ఈ సంఘటనను చదివాక మీరేమంతారో చూద్దాం. అది 1961-62 విద్యా సంవత్సరం. ఆయేడే యెస్సెల్సీ విద్యార్ధులకు హాల్ టికట్ విధానం మొదలయింది.ఆ హాల్ టికట్ స్కూల్నుంచి తీసుకున్న విద్యార్ధి అతిజాగ్రత పాటించాలని భావించి అది ప్యాంట్జెబులొ
హాల్ టికట్ పెట్టి మర్చిపోతే-- అదే జరిగింది.ఎవరివిషయంలోనో కాదు,నా విషయంలోనే.ఇక మా నాన్న హడావిడి అంతా ఇంతాగాదు ఇల్లంతా తూర్పారబట్తాడు. మెట్టు మీద వరి బస్తాలన్నీ దింపించి మరీ చూశా డు[ఎందుకంటే మన ఆటస్థలం అదేగనుక. ఇక అటక నంతటినీ జల్లించాఇక పోయిందని తైసాక ఒక్క మాటా పల్లెత్తు గా నన్ను అనకుండా వాడిమొహం వాడికెం తెలుస్తుండి అని సమ్రర్ధించగలగడం ఆయన ఆదరాభిమానాలకు నిదర్శనం. ఇక యేం చెయాలి.HM గారు గద్దల జాకబ్ గారు. వాళ్లమ్మాయి శాంతకుమారి[అనిగుర్తు] నా సహాధ్యాయి.ఇద్దరూ తెలిసిన వెంనే బయలుదేరి ఒచ్చారు.ఆ అమ్మాయి మాత్రం కన్నేఎళ్ల పర్యంతం అయింది. ఒక కులం కాదు ఒకే మతమూ కాదు.ఎందుకీ వల్లమాలిన అభిమానం.అప్పకింకా పిచ్చి సినిమాలూ ,వెర్రి సీరియల్సూ ఏమీ మనుషులనూ మనసులనూ కలుషితం చేయనిరోజులు. ఒక్క దీయీవూ గారివల్లనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఇదీ సమాచారం.ఎలా?అప్పట్లో దీయీవో గారిని కలవడం అంత తెలికయిన విషయమూ గాదు.మా బావగారు తాడికొంద స్కూల్లో సైన్సు టీచర్. ఆయనకు తెలిసిన ఆచార్యులు[పూర్తి పేరు ఎంత తన్నుకున్నా ఇప్పటికిప్పుడు గుర్తు రావడంలెదు.] గెజటెద్ ఇన్స్పెచ్టర్ ఆఫ్ స్కూల్సు. ఆయన్ను కలిసాం. నేను యెమీ ఇప్పటికిప్పుడు చెప్పలెను. డీయీవో గారితో మాటాడి చెప్తానన్నారు.మల్లీ ఉత్కంఠే .నాకు యేదో తెలియని ద్ఘైర్యం. పరీక్ష రాయగలిగితే నా సత్త నిరూపించగలనని మొండి ధైర్యం.ఆయన నన్నొక్కడినే గదిలోకి పిలిచి నాలుగయిడు ప్రశ్నలడిగారు. సిలబస్ లోనె ననుకొండి. తర్వాత దూప్లికేట్ హాల్తిక్కట్ ఇవ్వడమె గాకుండా ఆ స్కూల్ సెంటర్ సూపరింటెండెంట్ గారికి ఫోన్ చేసి మరీ చెప్పఘలగడం వారి సుహృద్భావం, సౌజన్య శీలం. పరీక్షలు బాగానే రాసాను. మార్కులెన్నొస్తాయని నాన్న అడిగితే మొదటి తరగతికి తగ్గకుండా వస్తాయని చెప్పాను. ఆచార్యులు గారు చెప్పారురా నీ స్కూల్ first స్తావని చూద్దాం. ఆజనేయ దయా మన ప్రాప్తం.అన్నారు. పరీక్షలయాక పూర్తికాలం ఆటలకో పంచాయతీ లిబ్రరీలోనూ ప్రయివెట్ దాంట్లోనొ పుస్తకాలు నమలడం. ఆరోకు పీర్ల సావిడి ముందు ఖాలీ స్థలంల్లో బచాలాట [ఓకులాట అనికూడా అనే వారు] ఆడుతున్నాం.భాస్కర రెడ్ది సాయంత్రం ఆరింటికి రైల్ దిగి ఒవ్చ్చి ఒఋఏయ్ అబాయిల్యూ మీరెసుల్ట్స్ ఒచాయిరా రండి మీ నంసర్లు చెప్పండి అంటీ చెప్పాం. ఆ
క్షణంలో గుండె దడ దడా కొకొట్టి కోవడం ఓ కొసమెరుపు.ప్యాసయ్యాను ఒకరొ ఇద్దరో తప్ప అందరూ ప్యాసయ్యాం.పదిరొజుల తర్వాత మార్కుల లిస్టు. అందరూ ఊహించిన దానికన్నా భిఉన్నంగా క్లాసు first ఒచ్చింది. ఇక కంటనిండా కనీళ్లు. ఆంజనేయులు స్వామికీ, దేవుడులాంటి ఆచార్యులు వారికీ మనసులో నమస్కారాలు పె ట్టి కుని ఆచార్యులు గారిని పండ్లు కొన్ని ఇచ్చాం ససే మిరా ఒద్దన్నారు.బలవంత పెడితె తీసుకున్నారు------
=============================================================================